TRS leaders resigned today: ఎమ్మెల్సీలుగా అవకాశం రాని అసంతృప్త నేతల రాజీనామాల పర్వం మొదలైంది. అధికార తెరాస అసంతృప్త నేతలు గులాబీ కండువాకు గుడ్బై చెబుతున్నారు. ఇవాళ ఒకే రోజు ఇద్దరు తెరాస నాయకులు గులాబీ పార్టీకి రాజీనామా చేశారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు(gattu rama chandra rao resigned trs) ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు రాజీనామా లేఖను(resign letter to cm kcr) పంపారు. కేసీఆర్ అభిమానాన్ని, గుర్తింపును పొందడంలో విఫలమయ్యానని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపారు. వైకాపా నుంచి తెరాసలో చేరిన గట్టు రామచంద్రరావు.. ఎమ్మెల్సీతో పాటు పలు పదవులు ఆశించినా నిరాశ తప్పలేదు.
కరీంనగర్ మాజీ మేయర్ రాజీనామా
కరీంనగర్ జిల్లాలోనూ తెరాసకు షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్(karimnagar ex mayor ravinder singh resigned trs) ప్రకటించారు. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కరీంనగర్ పట్టణ భాజపా అధ్యక్షుడిగా ఉన్న తాను ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమ సయమంలో తెరాసలో చేరినట్లు ఆయన పేర్కొన్నారు.