తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు బోల్తా.. వ్యక్తి అక్కడికక్కడే మృతి - ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి

అతి వేగం ఎన్నో ప్రమాదాలకు కారణమవుతోంది. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు గట్టు దుద్దెనపల్లి వద్ద అతివేగంతో బోల్తా కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కారు బోల్తా కొట్టింది.. అక్కడికక్కడే మృతి

By

Published : Oct 30, 2019, 12:42 PM IST

అతివేగం బలి తీసుకుంటున్నా.. వాహనాల వేగం మాత్రం తగ్గడం లేదు. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు అతి వేగంతో గట్టు దుద్దెనపల్లి వద్ద బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను 108 ద్వారా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

కారు బోల్తా.. అక్కడికక్కడే ఒకరు మృతి

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details