తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తీరు సరికాదు' - తెలంగాణ ఉద్యమం

పీఆర్సీ కమిటీ నివేదికపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదంటూ తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ మండిపడ్డారు. తొలి పీఆర్సీని ఆమోదించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. కరీంనగర్​లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

The attitude of the govt towards the employees is not right says telangana non gazited officers
'ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు సరికాదు'

By

Published : Jan 28, 2021, 8:43 AM IST

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులు.. తొలి పీఆర్‌సీ నివేదికతో తీవ్ర నిరాశకు గురయ్యారని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ విషయంలో తీవ్ర జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కరీంనగర్​లో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు.

శాంతియుత పద్ధతిలో విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని జగదీశ్వర్​ పేర్కొన్నారు. సీఎంతో చర్చల అనంతరం.. ఎలాంటి పోరాటాలు చేపట్టాలో నిర్ణయించుకుంటామని‌ వివరించారు.

ఇదీ చదవండి:ఈ పీఆర్సీ.. ఉద్యోగులను అవమానించడమే: రేవంత్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details