కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. సీపీ వీబీ కమలాసన్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నగరంలోని తెలంగాణ చౌక్, రాజీవ్ చౌక్, టవర్, సర్కిల్ ఏరియా, విద్యానగర్, రాంనగర్, మంకమ్మ తోట ఏరియాల్లో మోటారు సైకిళ్లపై తిరుగుతూ గస్తీ నిర్వహించారు.
Lockdown: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బయటకు వస్తే ఐసోలేషన్కే.! - strict lockdown implementation in karimnagar
కరీంనగర్ జిల్లాలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. పోలీసులు ప్రతి నిత్యం అప్రమత్తంగా ఉంటూ లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి పరిస్థితులను పర్యవేక్షించారు.
![Lockdown: పోలీసుల ఆకస్మిక తనిఖీలు.. బయటకు వస్తే ఐసోలేషన్కే.! lockdown in karimnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11998141-295-11998141-1622705190494.jpg)
కరీంనగర్లో లాక్డౌన్
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి రాత్రివేళల్లో రహదారులపై తిరుగుతున్న వారిని పోలీసు వాహనంలో ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అనవసరంగా బయటికి వస్తే సహించేది లేదని నగరవాసులను సీపీ హెచ్చరించారు. తనిఖీలను ప్రతిరోజూ చేపడతామని తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలో అన్ని పనులు ముగించుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇదీ చదవండి:Immunity: వ్యాధి నిరోధక శక్తి పేరుతో సరికొత్త మెడికల్ దందా