ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక వైద్యసదుపాయాన్ని అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చైనాతో గ్రానైట్ వ్యాపారం అధికంగా జరిగే కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్పై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది.
'కరోనాపై కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు' - Coronavirus Latest News
జనాలను కరోనా కంగారు పెట్టిస్తుండటం వల్ల ఇప్పటికే అన్ని వర్గాల వారిని ప్రభుత్వం అప్రమత్తం చేస్తోంది. తాజాగా చైనాతో గ్రానైట్ వ్యాపారం చేసే కరీంనగర్ జిల్లాలో కరోనాపై వైద్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యసదుపాయం అందించే ఏర్పాట్లు చేశారు.
Coronavirus
వ్యాపార రీత్యా కరీంనగర్కు వచ్చే వారు... ఇక్కడి నుంచి చైనా, ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారికి కరోనా లక్షణాలు ఉంటే... తక్షణం వైద్యం అందించేందుకు జిల్లా ఆసుపత్రిలోనే ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు. అక్కడి సదుపాయాలపై ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్తో మా ప్రతినిధి ముఖాముఖి...
ఇవీ చూడండి:కరోనా ఎఫెక్ట్: మాస్క్లకు పెరిగిన డిమాండ్