తెలంగాణ

telangana

ETV Bharat / state

అంతిమయాత్రలోనూ 'సామాజిక దూరం'

అంతిమయాత్రలోనూ సామాజిక దూరం పాటించేలా చేసింది కరోనా వైరస్​. కరీంనగర్​ జిల్లా రామగుడు మండలం లక్ష్మీపూర్​లో గుండె పోటుతో మరణించిన చెట్ల మురళి అంతిమయాత్ర ఓదార్పులకు దూరంగా సామాజిక దూరం పాటిస్తూ సాగింది.

By

Published : Mar 26, 2020, 8:32 PM IST

sicial distance in final funaral
అంతిమయాత్రలోనూ 'సామాజిక దూరం'

కరోనా భయం ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది. చివరికి అంతిమయాత్రలో ఆత్మీయులే సామాజిక దూరం పాటించేలా చేసింది.

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్​లో చెట్ల మురళి గుండెపోటుతో మృతి చెందారు. మంత్రి కేటీఆర్​ చొరవతో మృతుని చిన్న కుమారుడు బెంగళూరు నుంచి స్వగ్రామానికి చేరుకున్నాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసేందుకు బంధువులు పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. వచ్చిన వారంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పాల్గొన్నారు.

గ్రామస్థులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మిత్రులు ఇలా అంతా సామాజిక దూరం పాటిస్తూనే అంతిమ వీడ్కోలు పలికారు.

అంతిమయాత్రలోనూ 'సామాజిక దూరం'

ఇవీచూడండి:కరోనాపై పోరుకు రైతన్న చేయూత.. కలెక్టర్​కు చెక్కు

ABOUT THE AUTHOR

...view details