కరీంనగర్ తీగులగుట్టపల్లికి చెందిన షేక్ సయిదా (Shaik Saida) నేర్పరితనం చూసి ప్రతి ఒక్కరు ముక్కున వేలేసుకుంటారు. తమ ప్రాంతంలో పాము వచ్చిందనే సమాచారం అందుకోవడంతోటే ఉరుకులు పరుగులతోనే చేరుకుంటోంది. రాత్రి పగలు ఎప్పుడైనా సరే పాము కనిపించిన ప్రాంతానికి చేరుకొని ప్రాణాలకు తెగించి పట్టుకొని ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతోంది.
వేల సంఖ్యలో...
చిన్నతనం నుంచే పాములను అలవోకగా పట్టుకుంటుండగా... ఇప్పటి వరకు వేలసంఖ్యలో పాములను పట్టుకొంది. రాత్రిళ్లు అయితే ఆ ప్రాంతంలోని వీధి దీపాలను ఆర్పేసి చాలా జాగ్రత్తగా పాము అలికిడి విని క్షణాల్లో బంధించేస్తుంది. ఎలాంటి విష సర్పాన్ని అయినా ఎంతో నేర్పుగా పట్టుకోవడం అలవాటుగా మార్చుకొంది. జాగ్రత్తగా పామును పట్టుకుని దాని కాటుకు గురికాకుండా అటవీశాఖకు అప్పగించడం లేదా సుదూర ప్రాంతాల్లో వదిలి వస్తుంటామని చెబుతోంది. తన కుమారునికి పాములు పట్టడం నేర్పినప్పటికీ నాలుగైదు సార్లు పాము కుట్టిందని చెబుతోంది సయిదా. ఎప్పుడు పాము వచ్చినా అది తమ చేతికి చిక్కే వరకు ప్రాణాలతో చెలగాటం ఆడినట్లుగానే ఉంటుందని అంటోంది.
తప్పటం లేదు...