ఇంటర్ ఫలితాలపై ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన - intermediate
ఇంటర్మీడియట్ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు.

ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన
కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఇంటర్మీడియట్ ఫలితాల పట్ల నిరసన వ్యక్తం చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ప్రభుత్వ అధికారుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈరోజు వెలువడిన ఫలితాలు పొంతన లేకుండా ఉన్నాయని ఆరోపించారు. జవాబు పత్రాలను ఆన్లైన్లో పొందుపరుస్తామన్నా అధికారులు నమోదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు.
ఎస్ఎఫ్ఐ నాయకుల ఆందోళన