మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పట్నుంచి కష్టం, సుఖం తెలిసిన మనిషి కావడం వల్ల ఊరి వాళ్లంతా ఆమెను సర్పంచిగా గెలిపించారు. ఆమె కూడా వాళ్ల ఆశల్ని వమ్ముకానీయ లేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. ప్రస్తుత లాక్డౌన్ సమయంలో కూలీనాలీ చేసుకునే కుటుంబాలకు తనవంతు సాయాన్ని అందించాలనుకుంది. 650 కుటుంబాలున్న శాలపల్లి, ఇందిరానగర్ గ్రామాల్లోని పేదల ఆకలిని తీర్చాలని భావించింది.
మూడెకరాల్లో పండించిన 150 బస్తాల సన్నరకం ధాన్యాన్ని బియ్యంగా మార్చింది. 53 క్వింటాళ్ల బియ్యాన్ని 25 కిలోల చొప్పున గ్రామంలో ఆకలితో అలమటిస్తున్న కుటుంబాలకు అందించింది. కూలీలు, పారిశుద్ధ్య కార్మికులకు కలిపి మొత్తం 212 కుటుంబాలకు ఉచితంగా పంచింది.