ఎట్టకేలకు కళ్లు తెరిచిన రవాణాశాఖ అధికారులు - వేములవాడలో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
వేములవాడలో జరిగిన బస్సు ప్రమాదం అనంతరం రవాణాశాఖ అధికారులు కళ్లు తెరిచారు. పలు పాఠశాల, కళాశాల బస్సులపై అధికారులు దాడులు నిర్వహించారు.
![ఎట్టకేలకు కళ్లు తెరిచిన రవాణాశాఖ అధికారులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4275819-806-4275819-1567060852320.jpg)
వేములవాడలో రవాణాశాఖ అధికారుల తనిఖీలు
కరీంనగర్ జిల్లా వేములవాడలో ప్రైవేట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం జరిగిన నేపథ్యంలో రవాణాశాఖ అధికారులుపట్టణంలో తనిఖీలు మొదలుపెట్టారు. ట్రాలీ ఆటోలో విద్యార్థులను తరలిస్తున్న వాహనాన్ని ఎంవీఐ ప్రమీలాదేవి ఆధ్వర్యంలో సీజ్ చేశారు. ఆటోలోని విద్యార్థులను ప్రమీలాదేవి కారులో పాఠశాలకు పంపించారు. అధిక లోడుతో వెళ్తున్న వాహనాలను, ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్సులు, హెల్మెట్లు లేకుండా వెళ్లే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
వేములవాడలో రవాణాశాఖ అధికారుల తనిఖీలు