తెలంగాణ

telangana

By

Published : May 19, 2020, 7:09 PM IST

ETV Bharat / state

రోడ్డు ప్రమాదం... ఒకరు మృతి

కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామశివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

road accident
road accident

క‌రీంన‌గ‌ర్- జగిత్యాల రహదారిపై రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామశివారులో కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘ‌ట‌న‌లో ఒకరు మృతి చెందారు. కరీంనగర్ సీతారాంపూర్​కు చెందిన ప్రభాకర్ రావు దంప‌తులు కొండగట్టు నుంచి కరీంనగర్ వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రభాకర్ రావు అక్కడికక్కడే మృతిచెందగా.. అత‌ని భార్య కు తీవ్రగాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు ఆమెను అంబులెన్స్​లో కరీంనగర్​కు తరలించారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి: ఖమ్మం జిల్లాలో కత్తితో దాడి.. ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details