కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో రంజాన్ పండగ వేడుకలను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిపి... ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దర్గాల వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.