తెలంగాణ

telangana

By

Published : Apr 25, 2021, 7:21 AM IST

ETV Bharat / state

కరోనా శవాల కోసం... ముందస్తు చితి పేర్చి...

కరోనా రెండో దశ తెలంగాణలో తీవ్రప్రభావం చూపిస్తోంది. కరోనాతో చనిపోయే వారి కోసం ముందస్తుగా పేర్చిన ఈ చితులే దానికి నిదర్శనం. ఈ ఘటన కరీంనగర్​లో చోటు చేసుకుంది.

pre-arranged-pyre-for-those-who-die-with-the-corona-in-karimnagar
కరోనా శవాల కోసం... కట్టెలు పేర్చి

కరీంనగర్‌లో కరోనా మరణాలకు ముందస్తుగా పేర్చిన ఈ చితులే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రోజుకు పదికి పైగా శవాలను శ్మశానవాటికలకు తరలిస్తుండటంతో దహన సంస్కారాలు నిర్వహించే ప్రైవేటు వ్యక్తులు ముందుగానే చితులు పేర్చి సిద్ధంగా ఉంచుతున్నారు. మానేరు నదీ తీరంలోని శ్మశానవాటికలో ఈ దృశ్యం కనిపించింది.

ఇతర ప్రాంతాలకు చెందిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణిస్తే కుటుంబీకులు కరీంనగర్‌లోనే దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అయిదు శవాలను తరలించగా, అందులో నాలుగు కరోనా శవాలు ఉన్నాయని, రాత్రివరకు ఇంకొన్ని వచ్చే అవకాశం ఉండటంతో ముందుగానే కర్రలు పేర్చి సిద్ధంగా ఉంచామని నగరపాలక సిబ్బంది తెలిపారు.

ఇదీ చూడండి:పంజా విసురుతోన్న కరోనా... పాడెలెక్కుతున్న బాధితులు

ABOUT THE AUTHOR

...view details