తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరీంనగర్​లో అవినీతిని వెలికితీసే అవకాశమివ్వండి' - కరీంనగర్​ నగరపాలక సంస్థ ఎన్నికలపై పొన్నం ప్రభాకర్​ మీడియా సమావేశం

కరీంనగర్​ నగరపాలక సంస్థలో కాంగ్రెస్​ జెండా ఎగరడం ఖాయమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ అన్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తెరాస పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.

ponnam prabhakar press meet on municipal election
'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'

By

Published : Jan 23, 2020, 10:13 AM IST

అధికార పార్టీ అక్రమాల వల్లే కరీంనగర్​లో ఎన్నికలు రెండు రోజులు ఆలస్యమయ్యాయని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్​ ఆరోపించారు. ఇతర పార్టీల నాయకులు గెలుపు కోసం ఇష్టారాజ్యంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారన్నారు.

తెరాస, ఎంఐఎం కుమ్మక్కయ్యాయని, ఆ పార్టీలకు ఓటర్లు గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. కరీంనగర్​లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు ఒక ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు. ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

'అవినీతిని ప్రశ్నించే గొంతుకు అవకాశం ఇవ్వండి'

ఇదీ చూడండి: కొత్త సంఘాల్లో ఓటర్ల జోరు .. హైదరాబాద్​ శివారులో మారని తీరు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details