తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

నేటి రాజకీయ నేతల పరిస్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది ఈ ఘటన. అసలే వయసు మీరిన వృద్ధురాలు... నడవరాదు. కంటిచూపు మందగించింది. ఓటు వేయను, నేనక్కడికి రాలేను అంటున్నా వినకుండా పార్టీ నాయకులు ఆమెను పోలింగ్ కేంద్రానికి తరలించారు. ఓటు వేయించి అక్కడే వదిలేశారు.

By

Published : May 10, 2019, 12:49 PM IST

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం గోపాలపురంలో ఓ వృద్ధురాలు ఓటేసేందుకు వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బందులు పడుతోంది. రెండో విడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా కంటి చూపు మందగించిన ఓ వృద్ధురాలిని పోలింగ్ కేంద్రానికి తీసుకువచ్చారు. దగ్గరుండి ఓటు వేయించారు. పనైపోయిందని ఆమెను వదిలి వెళ్లిపోయారు. గంట పాటు ఎవరైనా ఇంటికి చేరుస్తారేమోనని ఆ వృద్ధురాలు వేచిచూసింది. ఎవరూ రాకపోయేసరికి పోలింగ్ కేంద్రానికి ఓటేసేందుకు వచ్చిన యువకుడిని బతిమాలుకుంది. వృద్ధురాలి బాధను చూడలేని యువకుడు మోటార్ సైకిల్ వాహనంపై ఆమెను ఇంటికి చేర్చాడు.

ఓటేయకముందు ఓటు మల్లమ్మ, ఓటేశాక బోడి మల్లమ్మ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details