తెలంగాణ

telangana

By

Published : May 17, 2020, 6:53 PM IST

ETV Bharat / state

రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి

ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. ఈ దుర్ఘటన కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో జరిగింది.

one died in road accident at kotthagattu
రెండు ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో విషాదం చోటుచేసుకుంది. మత్స్య గిరీంద్ర స్వామి ఆలయం మూల మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడు దేశాయిపల్లికి చెందిన కూచన ప్రవీణ్(27)గా గుర్తించారు. హైదరాబాద్ నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని భార్య రాంభీ, కూతురికి తీవ్రగాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:శంషాబాద్​ వైపు వెళ్లిన చిరుత.. కొనసాగుతున్న వేట

ABOUT THE AUTHOR

...view details