తెలంగాణ

telangana

By

Published : May 11, 2020, 8:54 PM IST

ETV Bharat / state

22 రోజులుగా కరీంనగర్​లో కరోనా కేసులు లేవు...

కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో గత 22 రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదు. పాజిటివ్ కేసులు కూడా మూడుకు తగ్గిపోవడంతో ఉమ్మడి జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు.

karimnagar
karimnagar

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు మూడుకు తగ్గిపోవడంతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిత్యావసర వస్తువులు కొనుగోలుకు అనుమతిస్తున్నారు. విధిగా మాస్క్ ధరించాలని.. భౌతిక దూరం పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో గత 22రోజులుగా కొత్త కేసులు నమోదు కాకపోవడంతో రెండు జిల్లాలను గ్రీన్ జోన్​లోకి ఎప్పుడెప్పుడు మారుస్తారా అని వ్యాపారులు ఎదురు చూస్తున్నారు. పెద్దపల్లి జిల్లా గ్రీన్ జోన్​లో కొనసాగుతోంది.

ప్రస్తుతం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిని కంటైన్​మెంట్​ ప్రాంతంగా కొనసాగిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా ప్రజలు మాత్రం మధ్యాహ్నం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడానికి ఇష్టపడటం లేదు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇదీ చదవండి:ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details