తెలంగాణ

telangana

ETV Bharat / state

'జడ్పీ పాఠశాల విద్యార్థులకు నూతన బస్సు సర్వీస్' - ఉదయం, సాయంత్రం సర్వీసు నడిచేలా చర్యలు

కరీంనగర్​ జిల్లాలో విద్యార్థుల పోరాటం ఫలించింది. పిల్లల విజ్ఞప్తి జడ్పీ ఛైర్మన్ గుర్తించి వారి కోసం బస్ సర్వీస్ ప్రారంభించారు.

జడ్పీ పాఠశాల నుంచి శ్రీరాములపల్లి వరకు నూతన సర్వీసు ప్రారంభం

By

Published : Sep 21, 2019, 11:25 PM IST

Updated : Sep 22, 2019, 12:03 AM IST

కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంటలో ఆర్టీసీ బస్సు సర్వీసును జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నుంచి శ్రీరాములపల్లి వరకు నూతన సర్వీసును ఏర్పాటు చేశారు. బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని విద్యార్థులు ఇటీవల ఆమె దృష్టికి తెచ్చారు. స్పందించిన జడ్పీ ఛైర్​ పర్సన్ ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఉదయం, సాయంత్రం సర్వీసు నడిచేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పంపిణీ చేశారు.

జడ్పీ పాఠశాల నుంచి శ్రీరాములపల్లి వరకు నూతన సర్వీసు ప్రారంభం
ఇవీ చూడండి : 5వేల మందికి శిక్షణ ఇవ్వడమే మా లక్ష్యం
Last Updated : Sep 22, 2019, 12:03 AM IST

ABOUT THE AUTHOR

...view details