తెలంగాణ

telangana

By

Published : May 21, 2021, 12:01 PM IST

ETV Bharat / state

కొవిడ్​తో వృద్ధుడి ఆత్మహత్య .. అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం యువకుడు

కొవిడ్​ మహమ్మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. మనుషులపై శారీరకంగాను, మానిసికంగాను దాడి చేస్తోంది. కొవిడ్​ సోకిందని.. మనస్తాపంతో మృతిచెందిన ఓ వృద్ధుడికి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నాడు ఓ ముస్లిం యువకుడు.

తెలంగాణ వార్తలు
కరీంనగర్​ వార్తలు

కొవిడ్​ బారిన పడిన ఓ వృద్ధుడు… ఎవరూ ఆదరించలేదని మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఓ ముస్లిం యువకుడు చొరవచూపి మృతునికి అంత్యక్రియలు నిర్వహించాడు.

covid suicide

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగపూర్​కు చెందిన పోతారవేణి వెంగయ్య (69)కు కొవిడ్​ పాజిటివ్​ వచ్చింది. మనస్థాపంతో ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతునికి అంత్యక్రియలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అదే గ్రామానికి చెందిన ఇమ్రాన్ పాషా అనే యువకుడు మరో వ్యక్తితో కలిసి మృతదేహాన్ని పంచాయతీ ట్రాక్టర్​లో తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కొవిడ్​ భయంతో ఎవరు ముందుకు రాకున్నా... కుల మతాలకతీతంగా యువకుడు అంత్యక్రియలు నిర్వహించడాన్ని పలువురు అభినందించారు.

ఇదీ చూడండి:'రాష్ట్రంలో అందరికి ఉచిత కరోనా చికిత్స అందించాలి'

ABOUT THE AUTHOR

...view details