రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో చిన్న, సన్నకారు రైతులు ఆనందంగా ఉన్నారని పశుసంవర్థక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్తో కలిసి తలసాని... మీడియాతో మాట్లాడారు. కానీ కేంద్రం పిచ్చిపిచ్చి ఆలోచనలు చేస్తోందని విమర్శించారు. కరోనా సమయంలోనూ... 20లక్షల కోట్లు ఇస్తామని ప్రకటించి... ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని ఎద్దేవా చేశారు. విద్యుత్ బిల్లు ప్రవేశపెట్టి రైతులకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని - మంత్రి గంగులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశం
కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు బిల్లులు ప్రవేశపెడితే... ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 20 లక్షల కోట్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయలేదని విమర్శించారు.
![ఇష్టం వచ్చినట్టు బిల్లులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు: తలసాని minister thalasani srinivas yadav press meet in karimnagar with gangula kamalakar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8868601-thumbnail-3x2-thalasani.jpg)
ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజలు ఊరుకోరు: తలసాని
ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని తలసాని హెచ్చరించారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ బిల్లును వ్యతిరేకించడమే కాకుండా... పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు సూచించినట్టు వివరించారు. కరీంనగర్ నుంచి ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర గడిచినా... ఇంతవరకు నయాపైసా నిధులు తేలేదని, పైగా హైదరాబాద్లో కూర్చొని ఏవేవో మాట్లాడతారని బండి సంజయ్పై విమర్శలు గుప్పించారు.
ఇష్టమొచ్చినట్టు చేస్తే ప్రజలు ఊరుకోరు: తలసాని
ఇదీ చూడండి:మగబిడ్డ కోసం భార్య గర్భాన్ని కోసిన కిరాతకుడు