తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం కేసీఆర్‌ వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ: మంత్రి గంగుల - కేసీఆర్‌ వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ: మంత్రి గంగుల

కరీంనగర్ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన బంగారు కానుక స్మార్ట్ సిటీ అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరపాలక ఎన్నికలలో కొన్ని పార్టీలు మతం పేరుతో ఓట్లు అడుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. రెండో స్థానంలో నిలవడానికే మిగతా పార్టీలు పోటీచేస్తున్నాయని... కరీంనగర్ కార్పొరేషన్​పై తెరాస జెండా ఎగరవేస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

MINISTER GANGULA INTERVIEW
కేసీఆర్‌ వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ: మంత్రి గంగుల

By

Published : Jan 21, 2020, 11:04 PM IST

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ పనులు జరగకుండా భాజపా నేతలు అడుగడుగునా అడ్డుపడుతున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. తెరాసకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి మతం పేరుతో భాజపా నేతలు ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. రెండో స్థానం కోసమే ఇతర పార్టీలు పోటీపడుతున్నాయని... వాటితో తెరాసకు పోటీలేదని చెప్పారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌పై మరోమారు గులాబి జెండా ఎగరవేస్తామంటున్న మంత్రి గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి

కేసీఆర్‌ వల్లే కరీంనగర్ స్మార్ట్ సిటీ: మంత్రి గంగుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details