తెలంగాణ

telangana

By

Published : Feb 28, 2021, 7:43 PM IST

ETV Bharat / state

'కరీంనగర్ నగర అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు'

కరీంనగర్​ నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని మేయర్ సునీల్​రావు పేర్కొన్నారు. పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు.

mayor sunil rao started development programmes in karimnagar
'కరీంనగర్ నగర అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు'

కరీంనగర్ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని మేయర్ సునీల్​రావు పేర్కొన్నారు. పట్టణంలోని 16వ డివిజన్​లో భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణానికి కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్​తో కలిసి భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా కాలనీకి వెళ్లే రోడ్డు ఇరుకుగా ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ సునీల్​రావు దృష్టికి తీసుకురాగా.. రోడ్లు విస్తరించే పనులు చేపడుతున్నామని.. త్వరలోనే 16వ డివిజన్​లోనూ చేపడతామని తెలిపారు. నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎండాకాలం సమీపిస్తున్న దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

'కరీంనగర్ నగర అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు'

ఇదీ చూడండి: సోలార్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తినష్టం!

ABOUT THE AUTHOR

...view details