కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సీపీ వీబీ కమలాసన్ రెడ్డి కఠిన చర్యలు చేపడుతున్నారు. కొవిడ్ 19 నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇవ్వగా నగరంలోని ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్కు తరలి వస్తున్నారు. దీంతో వైరస్ తిరిగి విజృంభించే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు ఉన్నా లేకున్నా ప్రజలు పెద్ద మొత్తంలో బయటకు రావడంపై సీపీ కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
పటిష్ఠంగా లాక్డౌన్.. బయటకు వస్తే వాహనాలు సీజ్
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. ఉదయం పది గంటల తర్వాత బయటకు వచ్చినవారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. వాహనాలను సీజ్ చేస్తున్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్
లాక్డౌన్ సమయంలో నగరంలోని కాలనీల్లో సీపీ పర్యటిస్తూ అనవసరంగా బయటకు వచ్చిన వారి వాహనాలను సిబ్బంది సహాయంతో స్టేషన్కు తరలించారు. ఒకప్పుడు సీఐ, సిబ్బంది మాత్రమే గల్లీల్లో తిరుగుతుండేవారు. కానీ ఇప్పుడు సీపీ కమలాసన్ రెడ్డి సైతం రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి:వైద్య సిబ్బంది డిమాండ్లను నెరవేర్చాలి: ఈటల