కరీంనగర్ జిల్లా హూజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లంతకుంట, వీణవంక మండలాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను టీపీసీసీ బృందం పర్యటించింది. ధాన్యం నిల్వలను పరిశీలించిన బృందం వివరాలను ఆరా తీసింది. రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక బస్తాకు అదనంగా రెండు కిలోలు, తాలు పేరుతో మరో రెండు కిలోలు కోత విధిస్తూ రైతు నడ్డి విరుస్తారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాకు చెందిన మంత్రులు రైస్మిల్లర్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. ఐకేపీ మహిళా సంఘాలకు, హమాలీ కార్మికులకు చెల్లించాల్సిన కమిషన్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
నేటికీ ఖాతాలకు బదిలీ చేయలేదు...