Telangana Students in Ukraine: ఉక్రెయిన్ రాజధాని కీవ్ ఎయిర్పోర్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. భారత్ వచ్చేందుకు విమానం టికెట్టు బుక్ చేసుకున్న వారంతా ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే అంతలోనే యుద్ధం ప్రారంభం కావడంతో ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసివేసింది. గగన తలాన్ని డేంజర్ జోన్గా ప్రకటించింది. ఎయిర్పోర్టు నుంచి బయటకు వెళ్లే దారులను మూసివేసింది. దీంతో విద్యార్థులంతా ఎయిర్పోర్టులోనే ఉండిపోయారు. ఉక్రెయిన్లోని జాఫ్రోజియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.
భారత్కు రాలేక.. తిరిగి యూనివర్సిటీకి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నట్లు.. కరీంనగర్కు చెందిన విద్యార్థులు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఫోన్ చేశారు. తమ సమస్యలను వివరించారు. విద్యార్థుల సమస్యపై వెంటనే స్పందించిన ఎంపీ సంజయ్.. వెంటనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులందరినీ స్వదేశానికి రప్పించాలని విన్నవించారు.