తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్​ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలి'

ప్రభుత్వం వ్యాక్సిన్​ను అందరికీ ఉచితంగా అందిస్తుందని... ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కరీంనగర్​ మేయర్ కోరారు. కొవిడ్​ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలని కోరారు.

By

Published : Apr 20, 2021, 1:06 PM IST

karimnagar mayor sunil rao takes vaccine
'కొవిడ్​ రహిత రాష్ట్రం కోసం అందరూ సహకరించాలి'

కరోనా రెండోదశ విజృంభిస్తున్న వేళ అర్హులైన ప్రతి ఒక్కరు టీకాలు తీసుకోవాలని కరీంనగర్​ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావు సూచించారు. కరీంనగర్​లోని సప్తగిరి కాలనీలోని కొవిడ్​ వ్యాక్సినేషన్ సెంటర్​లో ఆయన టీకా వేయించుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్​ను అందిస్తుందని.. ఈ నేపథ్యంలో అందరూ వ్యాక్సిన్​ వేయించుకోవాలని సునీల్ తెలిపారు. కొవిడ్​ రహిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అపోహలను వీడి ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి:పడక లభించక కారులోనే కరోనా రోగి మృతి

ABOUT THE AUTHOR

...view details