సీజనల్ వ్యాధులపై నగర ప్రజల్లో చాలా అవగాహాన వచ్చిందని కరీంనగర్ నగర మేయర్ వై.సునీల్ వెల్లడించారు. ఆదివారం 10 గంటలకు 10 నిముషాలు అంటూ మంత్రి కేటీఆర్ ఇచ్చిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 33వ డివిజన్లో ఆయన పర్యటించారు.
'10 నిముషాలు పని చేయండి... సీజనల్ వ్యాధులను తరిమికొట్టండి' - సీజనల్ వ్యాధులపై కరీంనగర్ మేయర్
మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు అందరూ ఆదివారం పది నిముషాల కార్యక్రమంలో పాల్గొనాలని కరీంనగర్ మేయర్ వై.సునీల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరంలోని పలు కాలనీల్లో తిరుగుతూ సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
!['10 నిముషాలు పని చేయండి... సీజనల్ వ్యాధులను తరిమికొట్టండి' karimnagar mayor sunil on sesional dises](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8353462-933-8353462-1596962778749.jpg)
'10 నిముషాలు పని చేయండి... సీజనల్ వ్యాధులను తరిమికొట్టండి'
పలు నివాసగృహాలు సంద్శించి... పూల కుండీలు, వాడని ఖాళీ డబ్బాల్లో నీటిని తొలగించారు. సీజనల్ వ్యాధులు, దోమల నివారణ అంశాలపై ఇంటి యజమానులకు అవగాహాన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా కుంటుంబ సభ్యులు, చుట్టు పక్కల ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటారని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:'కాపాడే క్రమంలో తెలిసింది..వీరంతా కరోనా బాధితులని'