తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారు' - Games at the Karimnagar Ambedkar Stadium

కరీంనగర్​లో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పాల్గొన్నారు.

Karimnagar District Collector Shashanka Police Commissioner B Kamalasan Reddy said the two started the Government Employees' Games at the Karimnagar Ambedkar Stadium
'స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారు'

By

Published : Jan 19, 2021, 4:38 PM IST

మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల క్రీడా పోటీలను వారు ప్రారంభించారు.

స్నేహ భావం..

ఈ పోటీల్లో మహిళలకు కబడ్డీ, కోకో, పురుషులకు క్రికెట్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ప్రతి సంవత్సరం క్రీడలను నిర్వహించడం వల్ల ఉద్యోగుల మధ్య స్నేహభావం పెరిగి.. ఐక్యతతో పని చేస్తారని వివరించారు.

ఇదీ చదవండి:కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details