తెలంగాణ

telangana

అర్హులందరికీ రుణాలివ్వాలి: కలెక్టర్ శశాంక

అర్హత గల సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు 20 శాతం మూలధన రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ కె.శశాంక బ్యాంకులను ఆదేశించారు. కలెక్టరేట్​లో బ్యాంకర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్​ఎస్​ఎమ్​ఈల రుణాలపై సమీక్ష నిర్వహించారు.

By

Published : Jun 6, 2020, 12:10 PM IST

Published : Jun 6, 2020, 12:10 PM IST

karimnagar collector shashanka review with bankers on msme loans
ఎమ్​ఎస్​ఎమ్​ఈల రుణాలపై బ్యాంకర్లతో కలెక్టర్ శశాంక సమీక్ష

ఆత్మ నిర్భర భారత్ అభియాన్ ప్యాకేజీ కింద అర్హులందరికీ రుణాలు పొడిగించినట్లు కలెక్టర్ శశాంక తెలిపారు. ఎమ్​ఎస్​ఎమ్​ఈల రుణాలపై కలెక్టరేట్​లో బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు.

ఎమ్​ఎస్​ఎమ్​ఈలకు 20 శాతం మూలధన రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు. అర్హులైన రైతులందరికీ 10 శాతం కేసీసీ లోన్​ను అందజేయాలని సూచించారు. ముఖ్యంగా వరి మార్పిడి యంత్రాలు, హార్వెస్టింగ్‌ యంత్రాలు, ట్రాక్టర్ల కోసం డిమాండ్ ఉందన్నారు.

కరోనా వ్యాప్తి వల్ల స్వస్థలాలకు వలస వచ్చిన కార్మికులకు ఎస్​జీహెచ్​ ప్రకారం ప్రస్తుత పరిమితిలో 10 శాతం రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కలెక్టర్ శశాంక ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details