రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో.. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మధ్యమానేరు ప్రాజెక్టుకు నీటి తరలింపు విజయవంతం కావడం వల్ల.. ఇక పదో ప్యాకేజీపై దృష్టి సారించింది. రూ.3,050 కోట్లతో ఈ ప్యాకేజీ పనులు చేపడుతున్నారు.
ప్రధానంగా ఇందులో మధ్యమానేరు ప్రాజెక్టు నుంచి.. మూడు కిలోమీటర్ల గురుత్వాకర్షణ కాల్వ ద్వారా.. ఆ తర్వాత 6 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా అనంతగిరి రిజర్వాయర్కు నీటిని తరలించాలన్న లక్ష్యంతో పనులు చేపడుతున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఓపెన్ సర్జిపూల్ ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇప్పటికే మూడు మోటార్ల ట్రయల్ రన్ కూడా పూర్తి చేశారు.