కరీంనగర్లో ఈనెల 17న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహిస్తున్నామని డాక్టర్ విజయేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సదస్సులో వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
సదస్సుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, స్థానిక ఎంపీ బండి సంజయ్కుమార్ హాజరుకానున్నారని తెలిపారు. సదస్సులో ఐఎమ్ఏ రాష్ట్ర అధ్యక్షున్ని ప్రకటించనున్నామని వెల్లడించారు. ఈ సదస్సు వైద్యులతో పాటు పీజీ చేస్తున్న వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని... విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
'ఈనెల 17న ఐఎమ్ఏ రాష్ట్ర స్థాయి సదస్సు'
ఈనెల 17న కరీంనగర్లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు డాక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.
'ఈనెల 17న ఐఎమ్ఏ రాష్ట్ర స్థాయి సదస్సు'
ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!