కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఏరడపల్లికి చెందిన రమేష్-శారద దంపతులకు అభినయ, ఆలయ ఇద్దరు కుమార్తెలు. అనారోగ్య కారణాలతో ఆరు నెలల వ్యవధిలో తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. వారి ఆలన పాలన చూసేవారు లేరు. చెల్లికి అక్కే అమ్మలా మారింది. వారి దయనీయ పరిస్థితిపై ఈటీవీలో "పాపం పసివాళ్లు' అనే పేరుతో కథనం ప్రచురితమైంది. ఆ కథనానికి అధికార యంత్రాంగంతోపాటు పలువురు ప్రవాస భారతీయులు స్పందించారు.
నిత్యావసరాలు
హుజూరాబాద్ ఆర్డీవో బెన్ షలోమ్, సీఐ కిరణ్, తహశీల్దార్ బావుసింగ్లు నిత్యావసర వస్తువులతోపాటు రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. వారి దయనీయ పరిస్థితిని గమనించిన చొప్పదండికి చెందిన న్యాలపట్ల శేఖర్గౌడ్ న్యూజిలాండ్లో నివాసముంటున్నాడు. స్థానికుల నుంచి వీరి పరిస్థితిని తెలుసుకున్నాడు. రూ.30వేల నగదు ఆర్థిక సహయాన్ని అందించేందుకు ముందుకు వచ్చాడు.