తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈటల చిత్రపటానికి పాలాభిషేకం

మంత్రి ఈటల రాజేందర్ చిత్రపటానికి కరీంనగర్ జిల్లా వీణవంకలో తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. సోమవారం విద్యార్థి సంఘ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా... దానికి ప్రతిగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

By

Published : Jun 18, 2019, 6:59 PM IST

ఈటల చిత్రపటానికి పాలాభిషేకం


కరీంనగర్‌ జిల్లా వీణవంకలో తెరాస నాయకులు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక ప్రయాణ ప్రాంగణ కూడలి వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సోమవారం విద్యార్థి సంఘ నాయకులు మంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేయగా... దానికి ప్రతిగా తెరాస నాయకులు పాలాభిషేకం చేశారు. ఈటల నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

ఈటల చిత్రపటానికి పాలాభిషేకం

ABOUT THE AUTHOR

...view details