కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్లోని గాయత్రి పంపుహౌస్ వద్ద జలసవ్వడి నెలకొంది. నందిమేడారం నుంచి ఎత్తిపోస్తున్న ఎల్లంపల్లి జలాలు లక్ష్మీపూర్కు వచ్చి చేరుతున్నాయి. వచ్చిన నీటిని వచ్చినట్లుగా వరద కాల్వలోకి ఎత్తిపోస్తున్నారు. ఇటీవల కడెం జలాశయం నుంచి వచ్చిన వరదనీటితో నిండిన ఎల్లంపల్లి నీటిని వడివడిగా మధ్యమానేరుకు తరలిస్తున్నారు. నందిమేడారం వద్ద తాజాగా ఐదు మోటార్లతో భారీగా నీటిని గాయత్రి పంపునకు తరలిస్తుండగా.. అక్కడి నుంచి మోటార్లను నిరంతరాయంగా నడుపుతూ ఆ నీటిని రాంపూర్కు.. మధ్యమానేరుకు తరలిస్తున్నారు. మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు.
గాయత్రి పంపుహౌస్ వద్ద జలసవ్వడి
గోదావరి జలాలు మధ్యమానేరుకు వడివడిగా తరలుతున్నాయి. ఇటీవల కడెం జలాశయం నుంచి వచ్చిన వరదనీటితో నిండిన ఎల్లంపల్లి నీటిని వడివడిగా మధ్యమానేరుకు తరలిస్తున్నారు.
జలసవ్వడి
Last Updated : Aug 23, 2019, 5:04 PM IST