రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల(HEAVY RAINS)తో జలాశయాల(RESERVOIRS)కు వరద పోటెత్తుతోంది. శ్రీ రాం సాగర్(SRI RAM SAGAR), దిగువ మానేరు(LOWER MANERU), కోయిల్ సాగర్(KOYIL SAGAR) ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ఉంది. దీంతో ప్రాజెక్టుల నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరడంతో గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా శ్రీ రాం సాగర్
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్(SRI RAM SAGAR) ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 46,558 క్యూసెక్కులు ఉండగా.. 11గేట్ల ద్వారా 37,440 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి ద్వారా 7,500 క్యూసెక్కులు దిగువకు విడదల అవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తానికి చేరుకుంది. శ్రీ రాం సాగర్ పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతే మొత్తంలో కొనసాగుతోంది.
దిగువ మానేరు గేట్లు ఎత్తివేత