తెలంగాణ

telangana

ETV Bharat / state

ఒకే ఊరు.. ఒకే చెరువు.. మరో కొండ చిలువ! - కొండ చిలువను రక్షించిన అధికారుల వార్తలు ఎలా బోతారం

కరీంనగర్ జిల్లాలో కొండ చిలువ కలకల సృష్టించింది. ఎలా బోతారం గ్రామంలోని చెరువులో మత్స్యకారులు ఏర్పాటు చేసిన వలలో చిక్కుకున్న కొండ చిలువను అటవీ అధికారులు రక్షించారు. అనంతరం మానకొండూరు శివారు అటవీ ప్రాంతంలో వదిలేశారు. పాములు కనపడితే వాటిని చంపవద్దని.. తమకు సమాచారం అందిస్తే వచ్చి తీసుకెళ్తామని వారు సూచించారు.

కొండ చిలువను రక్షించిన అధికారులు.. స్థానికుల సెల్ఫీ
కొండ చిలువను రక్షించిన అధికారులు.. స్థానికుల సెల్ఫీ

By

Published : Nov 17, 2020, 5:39 PM IST

కరీంనగర్ జిల్లా ఎలా బోతారం గ్రామంలోని చెరువులో కొండ చిలువ కలకలం సృష్టించింది. చెరువులో చేపలు పట్టేందుకు వర్షకాలంలో వలను ఏర్పాటు చేశారు మత్స్యకారులు. ఆ వలలో కొండచిలువ వచ్చి చిక్కుకుంది. చేపల వేటకు వెళ్లిన సందీప్​.. వలలో ఉన్న కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు రంగంలోకి దిగారు.

ముందుగా కొండ చిలువ చనిపోయిందని జంతు సంరక్షణ అధికారి సుమన్​ కుమార్​ భావించాడు. వలను కట్​ చేస్తుండగా కొండచిలువ పాకుతూ నీటిలోకి వెళ్లింది. దీంతో కొండ చిలువు బతికే ఉందని తెలుసుకున్న సుమన్​.. దానిని రక్షించి.. మానకొండూరు శివారు అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఆ కొండ చిలువ సుమారు నాలుగు మీటర్ల పొడవు 40 కిలోల బరువు ఉందని సుమన్​ తెలిపారు. కొండ చిలువను పట్టుకున్న సుమన్​తో స్థానికులు సెల్ఫీలు దిగారు.

సోమవారం సైతం ఇదే ఊరు.. ఇదే చెరువులో ఓ కొండ చిలువ వలకు చిక్కింది. అక్కడే తెల్లవారే మరో కొండ చిలువ రావడంతో స్థానికుల్లో ఆందోళన కనిపిస్తోంది.

అయితే వర్షాలు తగ్గాయని.. ఏర్పాటు చేసిన వలలను తొలగించాలని మత్స్యకారులకు అటవీ అధికారులు సూచించారు. పాములు కనపడితే వాటిని చంపవద్దని.. తమకు చరవాణి ద్వారా సమాచారం అందిస్తే స్పందిస్తామని జంతు సంరక్షణ అధికారి సుమన్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:వలకు చిక్కిన కొండచిలువ... ఉలిక్కి పడ్డ మత్స్యకారుడు

ABOUT THE AUTHOR

...view details