తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యల పరిష్కారం కోరుతూ క్షేత్ర సహాయకుల ధర్నా - శంకరపట్నంలో క్షేత్ర సహాయకుల ధర్నా

సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధి హామీ క్షేత్ర సహయకులు నిరసనకు దిగారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో క్షేత్ర సహయకులు సమ్మె చేస్తున్నారు.

field assistants protest
క్షేత్ర సహాయకుల ధర్నా

By

Published : Mar 16, 2020, 1:45 PM IST

జీత భత్యాలు పెంచాలని.. 4779 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఉపాధి హామీ క్షేత్రసహాయకులు సమ్మెకు దిగారు. కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండల పరిషత్తు కార్యాలయ ఆవరణలో పలు గ్రామాల క్షేత్ర సహాయకులు మొకాళ్లపై కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

క్షేత్ర సహాయకుల ధర్నా

ఇదీ చూడండి:'మనం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల్ని రక్షించగలం'

ABOUT THE AUTHOR

...view details