తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెరాస అభ్యర్థులను రైతులు నిలదీయాలి'

సహకార ఎన్నికల్లో గెలిచిన తెరాస అభ్యర్థులను నిలదీయాలని రైతులను టీపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. కరెంటు బిల్లులు 30 రోజులకు ఇవ్వకుండా అనధికారికంగా 40 రోజులకు ఇచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు.

By

Published : Feb 8, 2020, 12:28 PM IST

Updated : Feb 8, 2020, 3:28 PM IST

Breaking News

రైతుబంధు, రుణమాఫీ ఇవ్వకుండా సహకార ఎన్నికల్లో తెరాస బలపర్చిన అభ్యర్థులను రైతులు నిలదీయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. తెరాస ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారని విమర్శించారు.

కరెంటు బిల్లులు 30 రోజులకు ఇవ్వకుండా అనధికారికంగా 40 రోజులకు ఇచ్చి ప్రజలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ప్రతి నెలా సక్రమంగా బిల్లులు ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

'తెరాస అభ్యర్థులను రైతులు నిలదీయాలి'

ఇదీ చూడండి :ఏసీబీకి చిక్కిన ఇద్దరు ఏఈలు

Last Updated : Feb 8, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details