ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దత్తోజిపేట రైతులు రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. పక్షం రోజులు గడుస్తున్నా అధికారులు తమ వైపు కన్నెత్తి చూడడం లేదని ఆవేదన చెందారు. తాలు, హమాలీల కొరత, లారీల కొరత లాంటి కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారని అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు.
ధాన్యం కొనట్లేదని రైతన్నల ఆందోళన - DATTOJIPETA RYTHULA ANDOLANA
ధాన్యం కొనుగోలు చేయడంలేదని రైతులు ఆందోళన చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన చేపట్టారు. అధికారులు పలు కారణాలు చూపి జాప్యం చేస్తున్నారని వాపోయారు.
![ధాన్యం కొనట్లేదని రైతన్నల ఆందోళన FARMERS PROTESTING FOR NOT PURCHASING PADDY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6985397-1078-6985397-1588148394410.jpg)
ధాన్యం కొనట్లేదని రైతన్నల ఆందోళన
రైతులు భౌతిక దూరాన్ని పాటించి రహదారిపై బైఠాయించారు. వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ గంట్ల వెంకట్ రెడ్డి, సహకార సంఘం సీఈవో మల్లేశం అక్కడికి చేరుకుని తూకం మొదలుపెట్టడానికి చర్యలు తీసుకోగా రైతులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి:సాదాసీదాగా తెజస వార్షికోత్సవం