తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన - farmers protest in karimnagar for not purchasing padi

తిమ్మాపూర్ మండలం అల్గునూరు ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. రోజుల తరబడి నిరీక్షిస్తున్నా తమ గోడు పట్టించుకునే వారే కరవయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Farmers' concern over grain purchase in karimnagar
ధాన్యం కొనుగోలు నిలిపేశారంటూ రైతుల ఆందోళన

By

Published : Dec 6, 2019, 9:08 PM IST

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్​ అల్గునూరులో రైతులు నిరసనకు దిగారు. ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తేమ ఉందంటూ తెచ్చిన ధాన్యం తిరిగి పంపించేస్తున్నారంటూ ఆరోపించారు. తేమ ఉన్న ధాన్యం కొనేందుకు మిల్లు యాజమాన్యం అంగీకరించకపోవడం వల్లనే తూకం నిలిపేసినట్లు కొనుగోలు కేంద్రం అధికారులు తెలిపారు.

ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details