తెలంగాణ

telangana

నకిలీ విత్తనాలను పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

అధికారులు ఎన్ని దాడులు నిర్వహిస్తున్నా నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. కరీంనగర్​ జిల్లా రంగశాయిపల్లిలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నాలుగు కిలోల పత్తి విత్తనాలు, 200 లీటర్ల నిషేధిత గ్లైపోసెట్​ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నారు.

By

Published : Jun 12, 2020, 10:43 PM IST

Published : Jun 12, 2020, 10:43 PM IST

fake cotton seeds caught in karimnagar district
నకిలీ విత్తనాలను పట్టుకున్న టాస్క్​ఫోర్స్​ పోలీసులు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులను టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగశాయిపల్లిలో మకాం వేసిన టాస్క్​ఫోర్స్ పోలీసులు అనుమానితుని ఇంటిపై దాడి చేసి నాలుగు కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 200 లీటర్ల నిషేధిత గ్లైపోసెట్ గడ్డిమందు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నిట్టు తిరుమల్, వేముండ్ల కుమార్​లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన రంగు మల్లయ్య పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి: అనుమతి లేకుండా విత్తనాలు విక్రయిస్తున్న రైతు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details