కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తోందని డీవైఎఫ్ఐ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి ఆరోపించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టికలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రైవేటు డయాగ్నస్టిక్ కేంద్రాల్లో సిటీ స్కాన్ సహా వివిధ రక్త పరీక్షల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని తిరుపతి అన్నారు. ప్రభుత్వం గత సంవత్సరం ధరల పట్టిక నిర్ణయించిందని.. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ధరల పట్టికను నిర్ణయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.