దేశంలోనే అత్యుత్తమ పోలీస్ స్టేషన్లలో 10వ స్థానంలో నిలిచిన కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట పీఎస్ సీఐ సృజన్ రెడ్డిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. డీజీపీ కార్యాలయంలో సృజన్రెడ్డిని శాలువాతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికవడంలో కృషి చేసిన వారిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా రెండేళ్లు రెండు పోలీస్ స్టేషన్లు మొదటి పది ఉత్తమ స్టేషన్ల జాబితాలో నిలవడం పట్ల కమిషనర్ కమలాసన్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భగా చొప్పదండి, జమ్మికుంట పీఎస్లో పని చేసే హోమ్ గార్డ్ నుంచి ఉన్నతాధికారులందరికి నగదు పురస్కారాన్ని అందచేస్తున్నట్టు డీజీపీ ప్రకటించారు.
జమ్మికుంట సీఐ సృజన్రెడ్డిని అభినందించిన డీజీపీ - telangana news
జమ్మికుంట సీఐ సృజన్రెడ్డిని డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. దేశంలోనే అత్యుత్తుమ పీఎస్లలో 10వ స్థానంలో నిలిచేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.

జమ్మికుంట సీఐ సృజన్రెడ్డిని అభినందించిన డీజీపీ
జమ్మికుంట సీఐ సృజన్రెడ్డి ఇటీవల రాష్ట్రపతి పతకం జీవన్ రక్షా మెడల్ను పొందారు. జమ్మికుంట పీఎస్ పరిధిలోని మడిపల్లి గ్రామంలో బావిలో పడి ప్రాణాపాయస్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులను తన ప్రాణాలను లెక్కచేయకుండా సీఐ సృజన్ రెడ్డి కాపాడారు. వారిని రక్షించినందుకు గుర్తింపుగా ఈ రాష్ట్రపతి మెడల్ లభించింది.
ఇదీ చదవండి: పోలీసులు, పరిశ్రమలకు వారధిగా ఎస్సీఎస్సీ: హోం మంత్రి