కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్లో పిడుగుపాటుకు రెండు ఆవులు మృతి చెందాయి. శుక్రవారం రాత్రి పిడుగులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. గ్రామానికి చెందిన ఐలయ్య.. తన ఆవులను వ్యవసాయ బావి వద్ద చెట్టుకు కట్టేశాడు. రాత్రి చెట్టుపై పిడుగు పడడం వల్ల ఆవులు చనిపోయాయి. బావి వద్దకు చేరుకున్న ఐలయ్య కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
పిడుగుపాటుకు ఆవుల మృతి
పిడుగుపాటుకు ఆవులు మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లా రాయికల్లో జరిగింది. శుక్రవారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగు పడి చెట్టుకు కట్టేసిన ఆవులు చనిపోయాయి.
ఆవుల వద్ద రైతు దంపతులు