తెలంగాణ

telangana

ETV Bharat / state

Petrol Price: పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన - పెట్రోల్ ధరలు తగ్గించాలంటూ సీపీఐ నాయకుల ఆందోళన

రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ నాయకులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ఎడ్ల బండిని నడుపుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు.

cpi leaders protesting against central government on heavy fuel prices at karimnagar district
పెరుగుతున్న పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా సీపీఐ నిరసన

By

Published : Jun 18, 2021, 7:00 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఐ నాయకులు నిరసన చేపట్టారు. పట్టణంలో ఎడ్ల బండిని నడుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం ఇంధన ధరలను అంతకంతకూ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తోందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్​లో క్రూడ్ ఆయిల్ ధరల సాకు చూపుతున్నారని ధ్వజమెత్తారు.

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి దేశంలోని అన్ని వర్గాల ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని విమర్శించారు. సామాన్యులు, చిరువ్యాపారులపై పెరుగుతున్న ధరలు భారంగా మారాయన్నారు. భవిష్యత్తులో ఎడ్ల బళ్లు, సైకిళ్లపై ప్రయాణం చేసే పరిస్థితి రానుందని విమర్శించారు. పెట్రోల్​, డీజిల్​ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

ఇదీ చూడండి:రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా

ABOUT THE AUTHOR

...view details