పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇఫ్తార్
సర్వ మతాల సారాంశం ఒకటే అని... సమాజంలో అందరూ కలిసి మెలిసి జీవించినపుడే శాంతియుత వాతావరణం నెలకొంటుందని కరీంనగర్ పోలీసు కమిషనర్ కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు.
కమిషనరేట్లో ఇఫ్తార్
కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ కమలాసన్ రెడ్డి ఇఫ్తారు విందు ఏర్పాటు చేశారు. శాంతి ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని రెడ్డి పేర్కొన్నారు. కులమతాల మధ్య సఖ్యతను పెంచేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. ఈ విందులో మత పెద్దలు, ఆర్డీవో భిక్షు, జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్లు పాల్గొన్నారు.