కరీంనగర్ పట్టణంలోని నాలుగో డివిజన్ కాన్పురలో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేకువజామున 3 గంటల సమయంలో.. ఉపవాసముంటోన్న ముస్లిం సోదరుల ఇళ్లకు తిరుగుతూ కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరు కరోనా నియమాలను పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'
కరీంనగర్ పట్టణం నాలుగో డివిజన్లో కార్పొరేటర్ నుజత్ అలీ కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రెండో దశ విజృంభిస్తోన్న నేపథ్యంలో.. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
covid awareness programme