తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి:  శశాంక - latest news on collector shashanka

కరీంనగర్​ జిల్లా కేంద్రంలోని ఎస్​.ఆర్.ఆర్​. కళాశాలలో ఏర్పాటు చేసిన మున్సిపల్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని కలెక్టర్ శశాంక పరిశీలించారు. ఓట్ల లెక్కింపుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Breaking News

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక అధికారులను ఆదేశించారు. కరీంనగర్​లోని స్థానిక ఎస్​.ఆర్​.ఆర్​. కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఒకేసారి 5 డివిజన్ల కౌంటింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

కౌంటింగ్ టేబుళ్లు, ఆర్వో టేబుళ్లు డివిజన్​ల వారీగా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ఏజెంట్లకు ప్రత్యేక బార్​కోడింగ్​ ఏర్పాటు చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు​నకు ఎక్కువ మంది సిబ్బందిని కేటాయించాలని.. పారదర్శకంగా కౌంటింగ్​ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరగాలి: శశాంక

ఇవీచూడండి: గెలవకపోతే మంత్రి పదవి ఊడుతుంది... జాగ్రత్త..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details