తెలంగాణ

telangana

'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

కరీంనగర్​లోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా పాలనాధికారి కె.శశాంక సందర్శించారు. దవాఖానాలో నూతనంగా ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్​ను పరిశీలించారు. త్వరలోనే పూర్తి స్థాయి సేవలు అందుబాటులోకి తెస్తామని వివరించారు.

By

Published : Mar 4, 2021, 9:07 AM IST

Published : Mar 4, 2021, 9:07 AM IST

collector shashanka visited karimnagar government hospital
'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను జిల్లా కలెక్టర్ కె.శశాంక సందర్శించారు. జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ కనుమల్ల విజయతో కలిసి పరిశీలించారు.

జిల్లాలోని పేదలకు 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు ఉచితంగా చేసేందుకు వీలుగా.. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రం హబ్, స్పోక్ మోడల్​ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కలెక్టర్​ పేర్కొన్నారు. ప్రస్తుతం 42 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. షుగర్, థైరాయిడ్, మూత్రపిండాల పనితీరు పరీక్షలు, కాలేయ పరీక్షలు, మూత్ర పరీక్షలు మొదలగునవి ఉచితంగా నిర్వహిస్తారని వివరించారు.

'రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రంలో త్వరలోనే పూర్తి సేవలు'

ఈ రోగ నిర్ధారణ కేంద్రంలో ప్రస్తుతం డ్రైరన్​ నిర్వహిస్తున్నామని.. త్వరలోనే సేవలను అందుబాటులోకి తెస్తామని కలెక్టర్​ తెలిపారు. ఈ సందర్భంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి నమూనాలు సేకరించి.. పంపేందుకు లక్ష్యాలను నిర్దేశించాలని జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిని ఆదేశించారు.

ఈ రోగ నిర్ధారణ కేంద్రానికి ప్రత్యేకంగా జనరేటర్, నీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో.. నిర్వహణ పకడ్బందీగా కొనసాగించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం పక్కన స్కానింగ్ సెంటర్, రేడియాలజీ సెంటర్​ల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. అనంతరం ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన సేవ పరీక్ష గదిని ఆయన పరిశీలించారు.

ఇదీ చూడండి: ఆస్తి పన్ను వసూలు కోసం ప్రత్యేక అధికారులు

ABOUT THE AUTHOR

...view details