కరీంనగర్ జిల్లా గంగాధర, రామడుగు, గుండి గోపాలరావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. కొవిడ్ రెండోదశ టీకా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.
కరోనా నిర్ధరణ పరీక్షలు, టీకా వేసేందుకు వేర్వేరు స్థలాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ టీకాలు అందరికీ వేసేలా కొన్ని నెలల పాటు చేపట్టే అవకాశం ఉందన్నారు.